వరల్డ్ కప్ అనంతరం భారత్ తమ తొలి పర్యటనను వెస్టిండీస్తో మొదలుపెట్టనుంది. ఈ మేరకు విండీస్ పర్యటనకు వెళ్లనున్న ఆటగాళ్ల జాబితాను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్టర్లు ఆదివారం ప్రకటించారు. మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. విరాట్ కోహ్లీ ఈ పర్యటనలో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అయితే ఏ ఫార్మాట్లోనూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు కనిపించక పోవడం గమనార్హం. ఇక అది మొదలుకుని మరోసారి ధోనీ రిటైర్మెంట్ అంశం మరోసారి చర్చకు తెరలేపింది.